Sunday, April 28, 2024

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి…కొత్తగా 8110 పాజిటివ్ కేసులు

ఏపీలో అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 97,863 సాంపిల్స్ ని పరీక్షించగా 8,110 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదకొండు మంది, పశ్చిమ గోదావరి లో తొమ్మిది, విశాఖపట్నం లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, గుంటూరు లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు మరియు నెల్లూరు లో ఒక్కరు
మరణించారు.

ఇక గడచిన 24 గంటల్లో 12,981 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,01,37,627 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు… 1787883
యాక్టీవ్ కేసులు….99057
డిశ్చార్జ్ అయిన కేసులు….1677063
మొత్తం మృతుల సంఖ్య….11763

Advertisement

తాజా వార్తలు

Advertisement