Wednesday, May 1, 2024

కేంద్రమంత్రి జవదేకర్ తో సీఎం జగన్ భేటీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ తోపాటు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తో సీఎం జగన్‌ భేటికానున్నారు. కాగా, సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement