Tuesday, May 7, 2024

ఎన్డీయే కూటమిలో జేడీఎస్‌ – అమిత్‌ షా , జేపీ నడ్డా తో భేటీ అనంతరం కుమారస్వామి ప్రకటన

న్యూ ఢిల్లీ- : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ. కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ పార్టీ భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. భాజపా అగ్రనేతలు అమిత్‌ షా , జేపీ నడ్డా తో భేటీ అనంతరం జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ కీలక భేటీ సమయంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కూడా అక్కడే ఉన్నారు.

ఈ చేరికపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. అమిత్‌ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారన్నారు. జేడీఎస్‌ ఎన్డీయేలో భాగస్వామి కావాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జేడీఎస్‌ను హృదయపూర్వకంగా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోడీ ‘న్యూ ఇండియా, స్ట్రాంగ్‌ ఇండియా’ విజన్‌ను బలోపేతం చేస్తుందని నడ్డా ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement