Monday, April 29, 2024

IPL | జైస్వాల్ హవా.. ముంబై టార్గెల్ ఎంతంటే !

ఐపిఎల్ 16వ సీజన్ లో ఇవ్వాల రాత్రి వాంక‌డే స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియ‌న్స్ జట్టు పోటీ ప‌డుతున్నాయి. రాజ‌స్థాన్, ముంబై మధ్య జరుగుతున్న ఈ 42వ‌ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. కాగా, రోహిత్ శ‌ర్మ క‌ప్టెన్సీ వ‌హిస్తున్న‌ ముంబై ఇండాయ‌న్స్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత‌ 120 బంతుల్లో 213 పరుగులు చేయాల్సి ఉంది.

ఇక‌, రాజస్థాన్ త‌రుఫున ఓపెన‌ర్ గా దిగిన జైస్వాల్ 62 బంతుల్లో 124 పరుగులతో (16 ఫోర్లు ,8 సిక్స్ లు) ముంబై బౌలర్లపై విరుచుకపడి సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు, మిగిలిన వారు ఎవ్వ‌రూ కూడా క‌నీసం 20 ప‌రుగులు కూడా చేయలేక బ్యాటింగ్ లో విఫలం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement