Friday, April 26, 2024

వన్డే సిరీస్‌కు అయ్యర్‌ దూరం

టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్నులో గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, భారత ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ బుధవారం అధికారికంగా ధృవీకరించారు. అయ్యర్‌ వన్డే సిరీస్‌ నుండి తొలగించబడ్డాడని, మార్చి 11న బీసీసీఐ మొదట ప్రకటించింది. గాయాలు ఆటలో ఒక భాగం. మా వద్ద అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉన్నాయి. మేము సమన్వయంతో ఉన్నాము అని భారత ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ విలేకరుల సమావేశంలో అన్నారు.

వెన్నెముక గాయం నుండి కోలుకున్న తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇటీవల భారత జట్టులోకి తిరిగి వచ్చిన కుడిచేతి వాటం అయ్యర్‌, అహ్మదాబాద్‌లో జరిగిన చివరి టెస్టులో అర్థంతరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లో అయ్యర్‌ బ్యాటింగ్‌ చేయలేదు, మార్చి 31న ప్రారంభమయ్యే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో ఫస్ట్‌హాఫకు కూడా అయ్యర్‌ దూరమయ్యే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement