Saturday, April 27, 2024

అశ్విన్‌ నెంబర్‌ 1.. బ్యాటర్లలో రోహిత్‌ 10, కోహ్లీ 13వ ర్యాంక్‌

భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ టెస్ట్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో పలువురు ఆటగాళ్ల ఐసీసీ ర్యాకింగ్స్‌ మెరుగయ్యాయి. టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మళ్లి నెంబర్‌ వన్‌ బౌలర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. సిరీస్‌లో 28 సగటుతో 25 వికెట్లు పడగొట్టాడు. దాంతో ర్యాకింగ్స్‌లో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జేమ్స్‌ అండర్సన్‌ను వెనక్కినెట్టాడు. చివరి టెస్టులో 186 పరుగులతో రాణించిన విరాట్‌ కోహ్లీ ఏడు స్థానాలను మెరుగుపరుచుకొని 13వ స్థానానికి ఎగబాకాడు. బ్యాటర్ల ర్యాక్సింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (9), రోహిత్‌ శర్మ (10) టాప్‌ 10లో నిలిచారు.

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టిమ్‌ సౌథీ 12వ స్థానానికి చేరాడు. అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ ర్యాకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకొని 44వ స్థానానికి చేరాడు. అలాగే ఆల్‌ రౌండర్ల ర్యాకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఉస్మాన్‌ ఖవాజా రెండు స్థానాలు మెరుగుపడి ఏడో స్థానానికి చేరాడు. ఆల్‌ రౌండర్‌ గ్రీన్‌ 11 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరాడు.

ట్రావిస్‌ హెడ్‌ 853 రేటింగ్‌ పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌ టెంబా బావుమా బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 14 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకోగా, ఐడెన్‌ మార్కామ్‌ 22వ ర్యాంక్‌కు చేరాడు. వెస్టిండీస్‌ క్రికెటర్‌ కైల్‌ మేయర్‌ 32వ స్థానానికి, ఆల్‌ రౌండర్లలో ఏడో స్థానానికి చేరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement