Thursday, April 25, 2024

బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆంధ్ర వాసులు

హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూల్ ప్రకాశం నంద్యాల జిల్లాల నుండి పలువురు మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి మంత్రి స్వాగతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం దేశ ప్రజలందరి కళ్ళు తెలంగాణ వైఫై చూస్తున్నాయని వేముల అన్నారు. దేశ అవసరాల కోసమే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు.

కర్నూల్ జిల్లాకు చెందిన కార్పొరేటర్ ముస్తాక్ సాయి తేజ్, సర్పంచ్ రామాపురం ప్రకాశం, సలీంబేగ్, వెంకటేశం మాజీ ఎంపీటీసీలు పలువురు, మాజీ జెడ్పిటిసి యూసుఫ్ బేగ్, కర్నూలు జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షురాలు రాధమ్మ తో పాటు పలువురు పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement