Tuesday, April 16, 2024

నిజామాబాద్ జిల్లా తెలంగాణ కు దిక్సూచి – రేవంత్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్ . . . నిజామాబాద్ జిల్లా తెలంగాణకు దిక్సూచి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ నగరంలో దుబ్బ,హమాల్ వాడి, రైల్వే గేట్, దేవీ రోడ్డు మీదుగా నెహ్రూ చౌరస్తా వరకు పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా నెహ్రూ పార్క్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్ గుర్తొస్తుందని, నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథిని బంధించిన జైలు గుర్తొస్తుందన్నారు.నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నరు,ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు? అని ప్రశ్నించారు.అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారన్నారు.
నగరంలో ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కు భాగస్వామి లేకుండా జరుగదా అని విమర్శించారు. అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగిందని, అంబెడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు.

మోదీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదని , ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉందన ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని అన్నారు . నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ,మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందేనని గుర్తు చేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని , ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామాన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని,2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ దన్నారు. ఎవరు మైనారిటీల సంక్షేమానికి పాటుపడ్డారో ముస్లిం సోదరులు ఆలోచించాలన్నారు. పరీక్షలు పెట్టడే పెట్టడు పెడితే పరీక్ష పత్రాలు లీకైతయని, ఉద్యోగాలన్నింటిని భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ,పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, రూరల్ ఇంచార్జి భూపతిరెడ్డి, పిసిసి కార్యదర్శి గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావిద్ అక్రం, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement