Saturday, April 27, 2024

Delhi: కాంగ్రెస్ కు ఐటి శాఖ షాక్.. 1700కోట్ల టాక్స్, వ‌డ్డీ క‌ట్టాలంటూ నోటీస్

ఇప్ప‌టికే కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు సీజ్
రాజ‌కీయ కుట్ర అంటూ నేత‌ల మండిపాటు

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీకి ఐటీ విభాగం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే తాజా నోటీసులిచ్చినట్లు వివేక్‌ తంఖా ఆరోపించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్‌ చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement