Sunday, April 28, 2024

AP TDP : టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే..

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకూ ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా హైకమాండ్ ప్రకటించడం జరిగింది.

ఇది ఇలా ఉంటే సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం.


అసెంబ్లీ అభ్యర్థులు:
చీపురుపల్లి- కళా వెంకట్రావు, భీమిలి గంటా
శ్రీనివాసరావు, పాడేరు-వెంకటరమేశ్నాయుడు, దర్శి- గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట-
సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు-వీరభద్రగౌడ్, గుంతకల్లు-గుమ్మనూరు జయరామ్,
అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి- కందికుంట వెంకట
ప్రసాద్.

లోక్ స‌భ అభ్యర్థులు:
విజయనగరం-కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు-
మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప-భూపేశ్ రెడ్డి, అనంతపురం – అంబికా
లక్ష్మీనారాయణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement