Saturday, May 4, 2024

Movie | తెలుగులో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేన‌ట‌.. వెల్ల‌డించిన స్పై భామా

తమిళ నటి ఐశ్వర్య మీనన్ నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ ఎంట‌ర్టైన‌ర్ స్పైలో కనిపించనుంది. రానా దగ్గుబాటి అతిధి పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్‌కి గ్యారీ బిహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాగా, తాజా అప్‌డేట్ ఏమిటంటే, నటి ఐశ్వర్య మీనన్ తన తదుపరి తెలుగు ప్రాజెక్ట్ గురించి వివరాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

యువి క్రియేషన్స్‌తో కలిసి కార్తికేయ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, కార్తికేయ ప్రస్తుతం క్లాక్స్ దర్శకత్వంలో తెర‌కెక్కుత‌న్న‌ బెదురులంక 2012 మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement