Friday, April 26, 2024

ఇదంత ముఖ్యమైన విషయమా?.. ర‌ఘురామ అరెస్ట్ వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణ రాజు అరెస్టు వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలన్న కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదంత ముఖ్యమైన విషయమా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అరెస్ట్ జరిగి ఇప్పటికే 11నెలలు గడిచింది కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమైన విషయమైతే రాత్రి 8 గంటలకు సైతం విచారిస్తామని అభిప్రాయపడింది. రఘురామకృష్ణ రాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన తనయుడు భరత్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సీబీఐకి నోటీసులు ఇచ్చింది. మరో రెండు వారాల్లో దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement