Saturday, March 16, 2024

స్విమ్స్ కోసం ఐఓసిఎల్ రూ.22 కోట్లు విరాళం

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ ఒ సి ఎల్ ) రూ.22 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది.

ఈ మేరకు టీటీడీ పరిపాలన భవనం లో శుక్రవారం సాయంత్రం ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారుల మధ్యలో ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, స్విమ్స్ లో రోగులకు వైద్య సహాయం అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్) ఈ నిధులను అందిస్తున్నా మన్నారు ఈవో ధర్మారెడ్డి టీటీడీ తిరుమలలో భక్తులకు, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు.

ఈ కార్యక్రమం లో తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, టీ టీ డీ జేఈవో సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఏసీఏవో సతీష్,, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఐఓసీఎల్ ఎపి, తెలంగాణ ఇంచార్జ్ అనిల్ కుమార్, రాయలసీమ రీజనల్ హెడ్ రోహిత్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement