Saturday, May 4, 2024

International – మిస్ వ‌ర‌ల్డ్ కిరీటంఎవ‌రిదో?… అడుగు దూరంలో సినీశెట్టి

మిస్ వ‌రల్డ్ పోటీల‌కు భార‌త్ అతిథ్యం
130 దేశాల నుంచి సుంద‌రీమ‌ణుల రాక‌
భారత్​ నుంచి చాన్స్​ కొట్టేసిన సినీశెట్టి​
9వ తేదిన ఫైన‌ల్స్.. జియో టీవీలో లైవ్ టెలీకాస్ట్​

మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 30 ఏండ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. ముంబైలో ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ పోటీలు మార్చి 9న ముగియనున్నాయి. ఈ ఎడిషన్‌లో130కి పైగా దేశాల అందాల భామలు పోటీపడగా.. భారత్‌ నుంచి కన్నడ బ్యూటీ సినీశెట్టి ఫైనల్‌ రౌండ్‌కు చేరుకుంది. టాప్‌ 20లో స్థానం సంపాదించుకుంది. బుధవారం రాత్రి జ‌రిగిన సెమీ ఫైన‌ల్స్​ పోటీకి సంబంధించిన ఫోటోలను సినీశెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ రాకీ స్టార్ సినీశెట్టి గౌనుని డిజైన్ చేశారు.

ఐశ్వర్య సాంగ్స్​కి సినీశెట్టి డ్యాన్స్​

మిస్‌ వరల్డ్‌ టాలెంట్ సెమీ ఫైనల్స్ రౌండ్‌లో ఐశ్వర్యా రాయ్‌ హిట్‌ సాంగ్స్‌కు సినీ శెట్టి డ్యాన్స్ చేసింది. హమ్ దిల్ దే చుకే సనమ్, బంటీ ఔర్ బబ్లీ వంటి మూవీలలోని హిట్‌ పాటలకు అద్భుతంగా డ్యాన్స్‌ చేసి ఐశ్వర్యకు అంకితమిచ్చింది. భారతీయ శాస్త్రీయ, బాలీవుడ్ నృత్య రీతుల కలయికతో చేసిన నృత్యం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

కన్నడ బ్యూటీకి కిరీటం దక్కేనా?

సినీశెట్టి రేసులో ఉండడంతో మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌పై అందరి దృష్టి ఉంది. ప్రపంచ సుందరి ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కార్యక్రమాన్ని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వ‌హిస్తున్నారు. 2017లో మానుషి చిల్లర్‌ ‘మిస్‌ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కన్నడ బ్యూటీ సినీ శెట్టి కిరీటాన్ని కైవసం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement