Sunday, May 5, 2024

TS – విజ‌యాన్ని అస్వాదించండి… బాధ్య‌త‌ల‌ను గుర్తించండి…రేవంత్

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ద్వారా మన సైనికుల పిల్లలకు సేవలు అందించడం మన సైన్యానికీ దేశానికీ గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. . గురువారం జరిగిన ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటర్‌ సైన్సెస్‌ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందంటూ పట్టాలు అందుకున్న విద్యార్థులను అభినందించారు. “మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి. ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. మీరు మీ సక్సెస్‌ను ఆస్వాదించండి, కానీ ఎప్పుడూ మీ బాధ్యతను మరిచిపోవద్దు. మీరు చేసే పనులు మీకు, మీ కుటుంబానికే కాదు మీ కాలేజీకి గుర్తింపును తీసుకొస్తాయి” అంటూ విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు ఈసందర్భంగా మెరిట్ సర్టిఫికేట్లను అందజేశారు. ఎసీడీఎస్‌ ఆంధ్ర, తెలంగాణ సబ్‌ఏరియా చైర్మన్ మేజర్‌ జనరల్ రాకేష్ మనోచా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement