Tuesday, April 30, 2024

Delhi: రాజ్య‌స‌భ‌కు ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి స‌తీమ‌ణి సుధామూర్తి నామినేట్…

న్యూఢిల్లీ – ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి స‌తీమ‌ణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేసారు. ప్రెసిడెంట్‌ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఇది మన నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు.

నారీ శ‌క్తికి సుధామూర్తి ప్ర‌తిరూపం – ప్ర‌ధాని

‘భారత రాష్ట్రపతి సుధామూర్తి ని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభలో ఉండటం మన ‘నారీ శక్తి’కి ఒక శక్తివంతమైన నిదర్శనం, ఇది మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమె ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ఎక్స్‌(ట్విట్టర్‌)లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement