Saturday, April 27, 2024

ముగిసిన ఇందిరాదేవి అంత్య‌క్రియ‌లు-క‌న్నీటిప‌ర్యంత‌మైన కృష్ణ‌..మ‌హేశ్ బాబు

ప‌ద్మాల‌య‌స్టూడియో నుండి ఫిల్మ్ న‌గ‌ర్ లోని మ‌హాప్ర‌స్థానం వ‌ర‌కు ఇందిరాదేవి అంతిమ‌యాత్ర కొన‌సాగింది. ఈ యాత్ర‌లో ఘటమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఇందిరాదేవి అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్‌బాబు సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చివరిసారి ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చూసి కృష్ణ, మహేష్‌ చలించిపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే అభిమాన హీరో తల్లిని కడసారి చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. అయితే అంత్య్రకియలకు కవరేజ్‌కి మీడియాకి అనుమతి లేకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement