మహిళల ఆసియా హాకీ 5 ప్రపంచకప్ ఫైనల్లో ఇవ్వాల థాయ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాదించింది. ఈ మ్యాచ్ లో 7-2 స్కోర్ తో థాయ్లాండ్ చిత్తుగా ఓడించింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న హాకీ 5 ప్రపంచ కప్కు కూడా అర్హత సాధించింది. ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 24 నుండి 27 వరకు మస్కట్లో జరుగుతుంది.
కాగా, ఈవేంట్ మొదటి మ్యాచ్ నుంచి అజేయింగా సాగిన భారత్ నేటి ఫైనల్ మ్యాచ్ లో అదే తీరును కొనసాగించింది. మొదటి అర్ధభాగంలో ముగిసేసరికి 4-1 స్కోర్ తో ఆధిక్యంలో ఉంది భారత్. ఇక సెకండాఫ్లో థాయ్లాండ్ జట్టు కు ఒక్క గోల్ కూడా చేసే చాన్స్ ఇవ్వలేదు భారత్. దీంతో సెకండాఫ్ లో మరో మూడు గోల్స్ చేసి గేమ్ ని 7-2 తో దక్కించుంది.
ఇక రేపటినుందచి ఒమన్లోని సలాలాలో ఆసియా మెన్స్ హాకీ 5 ప్రపంచ కప్ జరగనుంది. కాగా, క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్తో తన ప్రారంభ పోటీని ప్రారంభించనుంది.