Saturday, April 27, 2024

Indian Student: అమెరికాలో భార‌తీయ విద్యార్థి మృతి… క్యాంప‌స్‌లో మృత‌దేహం గుర్తింపు…

అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి మృతిచెందాడు. భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్‌ క్లిఫ్టన్‌ తెలిపారు. అతడి మృతదేహాన్ని క్యాంపస్‌లోని ఓ భవనం వద్ద గుర్తించామని పేర్కొన్నారు.

ఈ నెల 28 నుంచి కనిపించకుండా పోయిన తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య ఎక్స్‌ ద్వారా సాయం కోరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆచార్యను చివరిసారి ఉబెర్ డ్రైవర్ చూశాడు. యూనివర్సిటీ వద్ద ఆచార్యను వదిలిపెట్టింది అతడే. ఆ తర్వాతి నుంచి విద్యార్థి ఆచూకీ మాయమైంది. ఆచార్య తల్లి పోస్టుకు స్పందించిన చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement