Wednesday, May 8, 2024

జాతీయ గీతాలాపనలో కొత్త రికార్డు..

75 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతీయులు సరికొత్త రికార్డు సృష్టించారు. జాతీయ గీతాలాపనలో సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ, విదేశాల్లోని 1.5 కోట్ల మందికి పైగా జనగణమన పాడి, ఆ వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భారతీయులంతా ఆనందోత్సాహాలతో పాల్గొన్నట్లు తెలిపింది. జాతీయ గీతాన్ని కలిసికట్టుగా పాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 25న పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు భారత దేశ ప్రజల మనసులు, హృదయాల్లో ఓ మంత్రంలా వ్యాపించిందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: లుంగీలో రెచ్చిపోయిన భీమ్లా నాయక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement