Sunday, April 28, 2024

సాయితేజ్ ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ ప్రకటన

సుప్రీమ్ హీరో సాయితేజ్ లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ విడుదల తేదీ ఖరారైంది. పంద్రాగస్టు సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది.‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే.. అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

‘రిపబ్లిక్’ మూవీకి ‘ప్రస్థానం’ ఫేం దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టుల నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను సాయితేజ్ పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే తన ఇంటిపేరును తొలిసారి సాయితేజ్ తన పాత్రకు పెట్టుకున్నాడు. ఇంతవరకూ తాను పోషించిన పాత్రలలో పంజా అభిరామ్ అత్యంత ఇష్టమైనదని తేజ్ చెబుతున్నాడు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement