Thursday, April 25, 2024

మగధీర-బాహుబలి కాంబినేషన్లో భారీ మూవీ..

టాలీవుడ్ లో త్వరలోనే మరో మెగా క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మగధీర – బాహుబలి కలయికలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుందని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ప్రభాస్- రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ పై సెలెంట్ గా వర్క్ సాగుతోందని… ప్రభాస్ స్నేహితుల బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ ఈ కలయికలో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్రభాస్- చరణ్ ఇద్దరినీ కలిపి అసాధారణ బడ్జెట్ తో మరో లెవల్ సినిమాకి యువి సంస్థ సన్నాహకాల్లో ఉందని తెలుస్తోంది. ఇద్దరు అగ్ర తారలను ఒకచోట చేర్చి అభిమానులకు గొప్ప విజువల్ ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారట.

ఇప్పటికే ప్రభాస్ .. చరణ్ ఇద్దరికీ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు ఉంది. అది ఈ సినిమా బిజినెస్ ని మరో లెవల్ కి తీసుకెళుతుందన్న అంచనా ఏర్పడింది. చరణ్ ప్రస్తుతం RRR లో తారక్ తో కలిసి నటిస్తున్నారు. చిరంజీవితో కలిసి `ఆచార్య` చిత్రం చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్- సలార్- ఆదిపురుష్- ప్రాజెక్ట్ K (నాగ్ అశ్విన్ చిత్రం) వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.రాధే శ్యామ్ తో పాటు యువీ సంస్థ ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సన్నాహాలు చేస్తోంది. అందుకే చరణ్- ప్రభాస్ మల్టీస్టారర్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది.

సాహో ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో గ్యాప్ తీసుకున్నా.. యువీ సంస్థ ప్లానింగ్ లో ఎక్కడా తగ్గడం లేదు. ఇకపైనా వరుస పాన్ ఇండియా చిత్రాలు తీయాలన్న కసితో ఉంది. ప్రస్తుతం యువి సంస్థ అధినేతలు తమ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసిన ఇద్దరు యువ దర్శకులతో చర్చలు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్-చరణ్ ఇద్దరికీ సన్నిహితులైన దర్శకులు ఆ ఇద్దరూ అని తెలిసింది. ప్రస్తుతం చర్చలు సాగిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదని ఒక సోర్స్ చెబుతోంది.

ఇది కూడా చదవండి: భీమ్లా నాయక్ ఫ‌స్ట్ గ్లింప్స్‌పై విమ‌ర్శ‌లు

Advertisement

తాజా వార్తలు

Advertisement