Thursday, May 2, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్​-ఇండియా మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్​ లో భాగంగా తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత జరగబోతున్న తొలి సిరీస్​ ఇదే కావడం విశేషం. ఇక టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే.. రోహిత్ శర్మ తో పాటు కే ఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నారు. పుజార, కోహ్లీ, రహానే, పంత్ తో బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అయింది. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పాత్ర పోషిస్తుండగా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్ తో పాటు మహమ్మద్ షమి ఫేస్ బౌలింగ్ బలంగానే ఉంది. పిచ్ పై పచ్చిక ఉండటంతో పేస్ బౌలింగ్ కు అనుకూలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్పిన్నర్ అశ్విన్ అలాగే పేసర్ ఉమేష్ యాదవ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ లో మొత్తం నలుగురు పేసర్లతో బరిలోకి దిగ్గుతున్న భారత జట్టులో సిరాజ్ చోటు సంపాదించుకున్నాడు.

భారత జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (wk), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ జట్టు : రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్ (c), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్, జోస్ బట్లర్ (wk), సామ్ కర్రన్, ఒల్లీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

ఇది కూడా చదవండి: డ్రైనేజీలో క్లీన్ చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతి..అధికారులపై రేవంత్ ఆగ్రహం..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement