Monday, April 29, 2024

డ్రైనేజీలో క్లీన్ చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతి..అధికారులపై రేవంత్ ఆగ్రహం..

హైదరాబాద్ వనస్థలిపురం ఘోర విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీ క్లీన్ చేయడానికి మ్యాన్ హోల్ లోకి దిగిన అంతయ్య, శివ అనే ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. రాత్రి సమయంలో డ్రైనేజీ క్లీన్ చేసేందుకు దిగడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే రాత్రి స‌మ‌యంలో డ్రైనేజ్ క్లీన్ చేసేందుకు అనుమతులు ఉండ‌వు. కాంట్రాక్టర్ చెప్ప‌డంతో మొద‌ట శివ మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను అందులోనే చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా చిక్కుకుని ఊపిరి ఆడక మృతి చెందాడు. మ‌రో ఇద్దరు కార్మికులు మ్యాన్‌హోల్ బ‌య‌ట నుంచి వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫలితం దక్కలేదు. మ్యాన్‌హోల్ నుంచి స‌హాయ‌క సిబ్బంది మృతదేహాలను బ‌య‌ట‌కు తీశారు.

కాగా ఘటనపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంట్రాక్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ విధులు చేయించిన అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: సర్వే: అశ్లీల చిత్రాలు ఎక్కువగా ఎవరు చూస్తున్నారో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement