Monday, April 29, 2024

ప్రపంచ డ్రోన్ హబ్ గా అవ‌త‌రించ‌నున్న భార‌త్ – ప్ర‌ధాని మోడీ

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ కార్య‌క్ర‌మం అయిన భార‌త్ డ్రోన్ మ‌హోత్స‌వ్ ను ఢిల్లీలో ప్రారంభించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు..ప్రపంచ డ్రోన్ హబ్ గా అవతరించే శక్తి భారత్ కు ఉందని మోడీ తెలిపారు..గత ప్రభుత్వాల కాలంలో టెక్నాలజీని సమస్యగా చూశారు. పేదలకు వ్యతిరేకమని చూపించే ప్రయత్నాలు జరిగాయి. అందుకనే 2014కు ముందు పాలనలో టెక్నాలజీ వినియోగం పట్ల ఉదాసీన వాతావరణం నెలకొంది. పేదలు మరింత కష్టాలు పడ్డారు. మధ్య తరగతి వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నార‌న్నారు. స్మార్ట్ టెక్నాలజీ దేశ సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని ప్రధాని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ పట్ల దేశంలో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతమ‌న్నారు. ఇవన్నీ చూస్తుంటే డ్రోన్ రంగం అతిపెద్దదిగా అవతరించి, భారీగా ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ రూ.15,000 కోట్లకు చేరుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement