Friday, April 26, 2024

మూడు నెలల తర్వాత 40వేల దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం 43,071 కేసులు నమోదు కాగా సోమవారం 40 వేలకు దిగువకు వచ్చాయి. ఇది ఆదివారం నాటి కంటే 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 39,796 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229కి చేరింది. ఇందులో 2,97,00,430 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,02,728 మంది రోగులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 4,82,071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కాగా ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 723 మంది కొత్తగా మృతిచెందారని, 42,352 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటివరకు 35,28,92,046 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 4 నాటికి మొత్తం 41,97,77,457 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,22,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

ఇది కూడా చదవండి: కోయంబత్తూరు 30 మంది కంటిచూపును మింగేసిన బ్లాక్ ఫంగస్

Advertisement

తాజా వార్తలు

Advertisement