Sunday, April 28, 2024

కరోనా పంజా.. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రజలను భయపెడుతోంది. ఇప్పటికే కోవిడ్‌ పాజిటీవ్‌ల సంఖ్య 60 వేలు దాటింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టీవ్‌ కరోనా కేసుల సంఖ్య 52కే చేరినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఒక్క హైదరాబాద్‌లోనే 21 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మొదటి వేవ్‌, సెకండ్‌ వేవ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అవన్నీ పాటిస్తే సరిపోతుందని తెలిపారు. మాస్క్‌ ప్రతి ఒక్కరు తప్పని సరిగా వాడాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement