Sunday, May 5, 2024

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్​ నుంచి పలు రూట్లలో నడవపనున్న రైల్వే

రద్దీని క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్-మధురై (07191) రైలు.. సికింద్రాబాద్‌లో రాత్రి 9.25 గంటలకు బయలుదేరి రాత్రి 8.45 గంటలకు మధురై చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 1,8,15, 22 తేదీల్లో ఉంటుంది.

మదురై-సికింద్రాబాద్ (07192) మదురై నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 10,17, 24 తేదీల్లో సేవలు అందించ‌నుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, తిరువణ్ణామలై, విల్లుపురంలో ఆగుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement