Friday, May 3, 2024

మహాత్ముడి స్ఫూర్తితో.. కరోనాపై గాంధీ ఆస్ప‌త్రి సిబ్బంది యుద్ధం : సీఎం కేసీఆర్‌

గాంధీ ఆస్ప‌త్రిలో మహాత్ముడి విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టింపజేయడం చాలా గొప్ప విషయం. శ్రీనివాస్‌ యాదవ్‌, ఆయన మిత్రులందరికీ చిరస్థాయిగా కీర్తిదక్కుతుంది. కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని దడదడలాంచిన సందర్భంలో రాష్ట్రంలో రాజధాని నడిబొడ్డున అత్యంత ధైర్యంగా, బలోపేతంగా ప్రజల ప్రాణాలను కాపాడుతామని ధైర్యంగా పని చేసిన సంస్థ మన గాంధీ ఆసుపత్రి. ఇక్కడి వైద్యులు, వైద్య బృందం, ఆనాటి సూపరింటెండెంట్‌ నాయకత్వంలో చేసిన వైద్యులు, నర్సులు, సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది అందరూ గాంధీ ఆదర్శాన్ని, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని.. హాస్పిటల్‌కు గాంధీ గారి పేరుంది కాబట్టి.. వారి పేరు నిలబెట్టాలని.. కరోనా మహమ్మారి సమయంలో యుద్ధం చేశారు’ అని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లను రిజెక్ట్‌ చేస్తే ఇక్కడికి తీసుకువస్తే ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికి దక్కుతుంది. గాంధీ స్ఫూర్తిని నింపుకొని పని చేసిన వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నా అన్నారు. మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్యఫలితం అన్నారు. మహాత్ముడు ఎంత గొప్పవాడో.. ఆయన ప్రతిపాదించిన అహింశా, శాంతి, సేవ, తాగ్యనీరతి అనే సిద్ధాంతం ఎన్నటికైనా సార్వజనీనమైన, విశ్వజనీనమైన శాశ్వతమైన సిద్ధాంతం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement