Saturday, April 20, 2024

గాంధీ బాటలో నడుద్దాం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి సిటీ : గాంధీ బాటలో రాజకీయ నాయకులు అందరూ నడిస్తే కచ్చితంగా దేశం మరింత గొప్పగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తిరుప‌తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మంత్రి, డిప్యూటీ సీఎంతోపాటు ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, ఆదిమూలం, వరప్రసాద్, ఎమ్మెల్సీ భారత్, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర ప్రదాత మహాత్మా గాంధీ జ‌యంతిని పురస్కరించుకుని నివాళులర్పించడం జరిగిందన్నారు. నేటి యువ‌త ఆయ‌న సిద్ధాంతాల‌ను పాటించాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement