Thursday, April 25, 2024

తెలంగాణలో మరో ఊర్లో సెల్ఫ్ లాక్ డౌన్… మొత్తం మూడు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి వ్యాపించడానికి ఓ ప్రార్థనా మందిరం వేదికైంది. ఈస్టర్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు జరిపిన 60 మంది లో సగం మందికి లక్షణాలు కనిపించగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 32 మంది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో గ్రామస్థులు స్వచ్ఛంద లాక్ డౌన్ కు ముందుకు వచ్చారు.

సోన్ మండలం మాదాపూర్ గ్రామం నందు ఏకంగా ఒక రోజులో 32 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు గ్రామం మొత్తాన్ని దిగ్బంధించి స్వచ్ఛంద లాక్ డౌన్ కు పూనుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేసి ఎవరూ బయట తిరగవద్దని మాస్కు తప్పనిసరిగా ధరించాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఉదయం పూట నిత్యావసర సరుకుల నిమిత్తం కిరాణా షాపులు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. దీంతో గ్రామం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement