Saturday, May 4, 2024

భారత జనాభా 300 కోట్లా..?

భారత దేశ జనాభా ఎంత అని ఎవరిని అడిగిన సుమారుగా 130 కోట్లు వరకు ఉంటుందని ఎవరిని అడిగిన చెబుతారు. కాని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త లెక్కలు చెబుతున్నాడు. ఓ సందర్భంలో భారత జనాభాను ప్రాస్తావిస్తూ ఏకంగా 300 కోట్లు అనేశాడు. దీంతో అవాక్కవడం ప్రపంచం వంతయింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల వరల్డ్ డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగింది కదా. అందులో న్యూజిలాండ్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆ ఫైనల్ గురించి ఆయన గుర్తు చేశారు. ‘‘40–50 లక్షల జనాభా ఉన్న ఓ చిన్న న్యూజిలాండ్.. 100 “అని పలికి కాసేపు తడబడి ఆగి”…. 300 కోట్ల జనాభా ఉన్న భారత్ ను ఓడించింది’’ అని అన్నారు. దీంతో అప్రతిష్ఠపాలై నెటిజన్లతో తిట్టించుకున్నారు. దీంతో నెటిజన్లు, పాక్ జనాలు ఆయనపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టేశారు. అవునవును నిజమే అంటూ కొందరు, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన వ్యక్తిని చూసి నవ్వుతారా? అది నిషిద్ధమంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి మా ప్రధాని అని సెటైర్లు వేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: జగిత్యాల జిల్లాలో మరోసారి లాక్‌డౌన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement