Saturday, April 27, 2024

ప్రమాదంలో అణ్వాయుధాలు, దొంగల చేతికి కీలకం సమాచారం.. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

పాకిస్తాన్‌లోని అణాయుధాలను ఉద్దేశిస్తూ.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశంలో అణాయుధాలు సురక్షితంగా లేవని ప్రకటించారు. ఇవి దొంగలు, దోపిడీదారుల చేతిలోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దె దిగిన తరువాత.. అక్కడి సైన్యంతో పాటు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తనను గద్దె దించేందుకు సైన్యం ఎంతో కుట్ర పన్నిందని, వచ్చిన వారు అయినా అణ్వాయుధాలను సురక్షితంగా ఉంచగల సత్తా ఉందా..? అని ప్రశ్నించారు. కొత్త ప్రధాని పరిస్థితి కూడా తనలాగే అవుతుందని, ఎవరు వచ్చినా సైన్యం చేతిలో కీలు బొమ్మ కావాల్సిందే అని తేల్చి చెప్పారు. తనను గద్దె దించడంలో విదేశీ కుట్ర దాగి ఉందని విమర్శించారు.

ఖాన్‌ వ్యాఖ్యలు అర్థరహితం ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎస్‌పీఆర్‌) డిప్యూటీ జనరల్‌ (డీజీ) మేజర్‌ జనరల్‌ బాబర్‌ ఇఫ్తికర్‌ స్పందించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌ ఆర్మీ ఖండిస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్‌లోని అణాయుధాలు ఎంతో సురక్షితంగా ఉన్నాయని, ఇవి ఒక్కరికి చెందిన ఆస్తి కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పాక్‌ అణాయుధ కమాండ్‌, కంట్రోల్‌ వ్యవస్థ ఎంతో సురక్షితంగా ఉందని తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే ఏ దేశం వద్ద లేని అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో అణ్వాయుధాల రక్షణ కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement