Thursday, April 25, 2024

అవినాశ్ పారిపోతే మీకెందుకు.. సీబీఐ చూసుకుంటుంది : స్పీకర్ తమ్మినేని సీతారాం

కర్నూలు : కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందని స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్రపై మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డి పాత్ర ఉంటే సీబీఐ తేలుస్తుందని.. మీడియాకు చెప్పాలా? అని నిలదీశారు. ‘మీరేమైనా సీబీఐ చీఫా ? అంటూ మీడియా ప్రతినిధులపై తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వా మిని స్పీకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ కు తెలుగు భాష మాట్లాడడమే చేతకాదని విమర్శించారు. ముందస్తు ఎన్నిక లపై జగన్ చూసుకుంటారని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement