Friday, May 3, 2024

Yatra 2: ‘ నేను విన్నాను..నేను ఉన్నాను’ యాత్ర 2 ట్రైల‌ర్ రిలీజ్…

YouTube video

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది.

ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్‌, సాంగ్స్‌ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్‌ అభిమానుల గుండెలను తాకాయి. తాజాగా యాత్రా 2 నుంచి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

- Advertisement -

‘పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషిన్‌ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అన్నా.. మాకు అంత స్థోమత లేదు’ అని ఓ సామాన్యురాలు తన కూతురికి గురించి సీఎం వైఎస్సార్‌(మమ్ముట్టి)కి చెప్పే సీన్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. వైఎస్సార్‌ మరణం.. జగన్‌ ఓదార్పు యాత్రకు అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీ చేసే కుట్రలు.. పార్టీ పెట్టిన తర్వాత జగన్‌ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు..ఇవన్నీ ట్రైలర్‌లో హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఇక చివర్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్‌ కొడుకువు అన్నా..మాకు నాయకుడిగా నిలబడు అన్నా’అని అనగా..నేను విన్నాను..నేను ఉన్నాను’ అని జగన్‌(జీవా) చెప్పే డైలాగ్‌తో ఎమోషనల్‌గా ట్రైలర్‌ ముగిసింది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా క‌ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement