Thursday, May 2, 2024

ఇంత‌టి క్రూర‌త్వ‌మా..భార్య‌ని క‌రెంట్ స్తంభానికి క‌ట్టేసి కొట్టిన భ‌ర్త‌

భార్య‌భ‌ర్త‌లన్నాక గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మే. అయితే ఓ భ‌ర్త మ‌నిష‌న్న మాన‌వ‌త్వాన్ని మ‌ర‌చి త‌న భార్య‌ని క‌రెంట్ స్తంభానికి క‌ట్టేసి మ‌రీ కొట్టాడు. ఈ సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్‌ బీహారి భార్యా భర్తలు. ఇద్దరి మధ్య గతకొంతకాలంగా గొడవ జరుగుతున్నాయి. ఈ క్రమంలో అతడు కుసుమా దేవిని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు చెప్పవ‌ద్ద‌ని భర్త, అత్త.. ఆమెను హెచ్చరించారు. అయితే విసిగి వేసారిన ఆమె విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే అది తెలుసుకున్న శ్యామ్‌ బీహారి.. ఆమెను రోడ్డుపై స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టాడు. దీన్నంతా పొరుగువారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement