Tuesday, April 30, 2024

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి భద్రత పెంపు.. ఉత్తర్వులు జారీచేసిన హోం శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ట‌ఈఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోహిత్‌ రెడ్డికి 4 ప్లన్‌ 4 గన్‌మెన్లను కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇప్పటి వరకు రోహిత్‌ రెడ్డికి కేవలం 2 ప్లన్‌ 2 భద్రత ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంఖ్యను 4 ప్లస్‌ 4కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంఎల్‌ఏలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రోహిత్‌ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్‌ ఫాం హౌస్‌పై దాడులు చేసిన పోలీసులు.. నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాండూరు ఎంఎల్‌ఏ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. కాగా ఎంఎల్‌ఏ రోహిత్‌ రెడ్డితో నిందితులు జరిపిన ఫోన్‌ ఆడియోలు రెండు విడుదల అయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement