Saturday, May 4, 2024

ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు ఊర‌ట .. భూకేటాయింపును స‌మర్ధించిన హైకోర్టు..

హైదరాబాద్‌: దర్శకుడు ఎన్‌.శంకర్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని హైకోర్టు స‌మ‌ర్ధించింది.. ఈ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ పిల్‌ను కొట్టివేసింది. స్టూడియో నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా మోకిలలో ఎన్‌.శంకర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించింది.. అయితే కొంద‌రు కోర్టుకు వెళ్ల‌డంతో స్టూడియో నిర్మాణ ప్ర‌క్రియ నిలిచిపోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement