Saturday, May 4, 2024

Big Breaking | టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే.. అద‌న‌పు పాయింట్ల‌పై అభ్యంత‌రం

టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 14 వరకు బదిలీలపై స్టే విధిస్తున్నట్లు కోర్టు వెల్ల‌డించింది. బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయ‌ని, నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై పిటిష‌న్‌లో అభ్యంతరం వ్య‌క్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మార్చి 14 వరకు స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement