Wednesday, May 22, 2024

హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట

నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగాయ‌ని, సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న‌ ఆరోప‌ణ‌ల‌పై కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇటీవ‌లే 14 రోజుల విచార‌ణ పూర్తి చేసింది. త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని హైకోర్టు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఇటీవ‌ల పిటిష‌న్ వేశారు. దీంతో ఆయ‌న‌ను ఊర‌ట ల‌భించింది. ఆయ‌న పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement