Friday, April 26, 2024

ఐసీయూలో చేరిన ప్రముఖ నటుడి భార్య

దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరా భాను తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. సైరా భానుకు హర్ట్‌ స్టోక్‌ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం ఆమెను కుటుంబ సభ్యులు హిందూజా ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా సైరా భాను భర్త, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌ ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. 98 ఏళ్ల వయస్సు ఉన్న నటుడు దిలీప్ కుమార్‌ అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది జూలై 7న కన్నుమూశారు. తాజాగా దిలీప్ కుమార్ భార్య సైరా భాను కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement