Tuesday, April 30, 2024

అమానుషంపై హరీశ్ ఆగ్ర‌హం.. విచార‌ణ‌కు ఆదేశాలు..

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై మంత్రి హరీశ్‌ రావు సీరియ‌స్ అయ్యారు. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నిజానిజాలు తెలిసేలా విచారణ జరిపి, తక్షణమే నివేదిక అందజేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. అనారోగ్యంతో నిజామాబాద్ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని అతని సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా ఉన్న ఆ దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రోగి రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు స్పందించి విచార‌ణ‌కు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వీడియోపై నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందిని విచారించినట్లు తెలిపారు. వీల్‌ఛైర్‌ తీసుకొచ్చేలోపు లిఫ్ట్‌ రావడంతో రోగి తల్లిదండ్రులు అతని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని చెప్పారు. ఇది చూసి సిబ్బంది వారించి.. వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారని స్పష్టం చేశారు. ఇదంతా తెలియక ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement