Saturday, May 18, 2024

నిర్మాత‌ల క‌ష్ట‌న‌ష్టాలు నాకు తెలుసు-టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్

ఓ సినిమా రిలీజ్ కి థియేట‌ర్లు ఇవ్వ‌కుండా..ఓటీటీలోనూ విడుద‌ల చేసుకునే అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ . నిర్మాతల కష్టనష్టాలు తనకు తెలుసని, కాబట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఘటనలతో తాను ఏకీభవించబోనన్నారు. తన సినిమాను ఎప్పుడు అమ్ముకోవాలో నిర్మాతే నిర్ణయించుకోవాలని అన్నారు. అంతేకానీ, తన సినిమాను ఎప్పుడు అమ్ముకోవాలో అసోసియేషనో, మరోటో చెప్పడం సరికాదని అన్నారు. ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ అమ్ముకునే అవకాశం నిర్మాతకు ఉండాలన్నారు.

నిర్మాతలపై అసోసియేషన్ ఆంక్షలు పెడితే సినిమా విడుదలకు థియేటర్స్‌ను కూడా పర్సెంటేజీ విధానంలో ఇవ్వాలని, అదే తమ డిమాండ్ అని అన్నారు. మలేషియాలో ఉన్న ‘సన్‌షైన్’ ఓటీటీ సంస్థను టీఎఫ్‌సీసీతో కలిసి బొల్లు నాగశివప్రసాద్ త్వరలోనే ఇండియాలోనూ ప్రారంభించనున్నారు. దేశంలో ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోందని అన్నారు. సన్‌షైన్ ఓటీటీ ద్వారా తెలుగు సహా అన్ని భాషల చిత్రాలను విడుదల చేస్తామని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement