Wednesday, May 1, 2024

ప్రముఖులకు తప్పని లోన్ యాప్ వేధింపులు.. ఏకంగా మంత్రికే ఫోన్..!

నెల్లూరు : లోన్‌ యాప్‌ వేధింపులు ప్రముఖులకు సైతం తప్పడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్‌కు లోన్ యాప్ ఏజెంట్ల నుంచి కాల్స్ వచ్చాయి. లోన్‌ తీసుకోకపోయినా మంత్రికి వేధింపులు తప్పడం లేదు. కాకాని నెంబర్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి ఫోన్‌లో ఉంది. ఈఎంఐ చెల్లించాలని కాకానికి ఏజెంట్ల బెదిరింపులు. మంత్రి పీఏ శంకర్‌ ఏజెంట్లకు రూ.25 వేలు చెల్లించారు. అయినప్పటికీ మళ్లిd కాల్స్‌ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై నుంచి కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నలుగురు రికవరీ ఏజెంట్ల అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement