Friday, May 3, 2024

రూ.5 లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం..

జూపాడుబంగ్లా, ప్రభన్యూస్ : అక్రమంగా తరలిస్తున్న రూ.5 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను జూపాడుబంగ్లా ఎస్ ఐ వెంకట సుబ్బయ్య గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జూపాడుబంగ్లా మండలం పరిధిలోని తంగేడంచ గ్రామంలో కె జి రహదారిలో ఎం పి యూ పి పాఠశాల సమీపంలో బొలెరో వాహనం అపుకున్న వాహనం అనుమానాస్పదంగా కనిపించినట్లు గ్రామస్తులు ఎస్ ఐ వెంకట సుబ్బయ్యకు సమాచారం ఇచ్చారు.

ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకుని బొలెరో వాహనం ఏ పి 31 టి హెచ్ 5187 తనిఖీ చేయగా రూ.5లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా 30 సంచులు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని పోలీసు స్టేషన్ కు తరలించి వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల భాస్కర్ రెడ్డి, వినుగొండకు చెందిన కొలుగు శెట్టిలు ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement