Monday, April 29, 2024

డీఎంఈ పరిధిలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తతం పనిచేస్తున్న చోట కనీసం రెండేళ్ల సర్వీస్‌ పూర్తయిన వారు మాత్రమే బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్‌ కళాశాలల్లోని ఖాళీలను మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఒకవేళ బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల కంటే ఎక్కువ ఉంటే నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఖాళీల్లో భర్తీ చేస్తారు.

కౌన్సిలింగ్‌ సందర్భంగా ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలల్లోని ఖాళీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించరు. ఒక పోస్ట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే స్పౌజ్‌, అంగవైకల్యం, బుద్ధిమాంద్యులైన పిల్లలు, కారుణ్య నియామకాలు, కటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు వంటి అంశాల ఆధారంగా ప్రాధాన్యం నిర్ణయిస్తారని వైద్య,ఆరోగ్య శాఖ బదిలీలకు విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement