Thursday, May 2, 2024

జాతీయ గీతం పాడేందుకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం

మూడు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుండటంతో ఈ ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా స్మరించుకోవాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో ప్రజలు జాతీయ గీతం ఆలపించే వీడియోలను సమర్పించాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది.

కాగా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు జాతీయ గీతం పాడాలని భావిస్తున్నారా? అయితే ప్రభుత్వ ‘లెట్స్ సింగ్ ది నేషనల్ సాంగ్’తో జత కలవండి. మీరు జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియోలను rashtragaan.inకు పంపించండి. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు జనగనమణ పాడిన వీడియోను Mygovindia అధికారిక యూట్యూబ్ పేజీలో షేర్ చేసింది. ఎవరైనా వ్యక్తి లేదా సమూహాలు అధికారిక వెబ్‌సైట్ rashtragaan.inలో తమ పేరు నమోదు చేసుకుని, ఓ ఫారాన్ని నింపి వారి వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. జాతీయ గీతాన్ని పాడి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను ఆగస్టు 15న ప్రత్యక్షంగా చూపిస్తారు. అంతేకాకుండా వారికి ఓ సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు

Advertisement

తాజా వార్తలు

Advertisement