Thursday, May 2, 2024

ఏపీ కరోనా అప్డేట్!! కొత్తగా ఎన్నంటే ?

ఏపీలో క్రమేణా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,757 సాంపిల్స్ ని పరీక్షించగా… 1,859 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు మరియు విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.

ఇక గడచిన 24 గంటల్లో 1,575 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,54,53,520 సాంపిల్స్ ని పరీక్షించారు.

యాక్టీవ్ కేసుల సంఖ్య…18688
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…1988910
డిశ్చార్జ్ అయినవారి సంఖ్య…1956627
మొత్తం మరణాల సంఖ్య..13595

Advertisement

తాజా వార్తలు

Advertisement