Tuesday, April 30, 2024

నడిరోడ్డుపై కారులో మంటలు

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామా శివారులో 65వ జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజన్ ఫెయిల్ కావటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా మధ్యలో కోహీర్ మండలం దిగ్వల్ గ్రామా సమీపంలో కారు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement