Saturday, April 20, 2024

రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్ రాజేంద్రనగర్‌‌లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గండిపేట సీబీఐటి రోడ్డులో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. గండిపేట నుండి నార్సింగ్ వైపు ఒక కారు వెళుతోంది. అయితే ఆ కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. కారు వెళ్లే దారిలో ఆటో ఒక్కసారిగా అడ్డు వచ్చింది. దీంతో ఆ ఆటోను తప్పించబోయి కారు కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కౌశిక్, జో డౌన్ అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: జాతీయ గీతం పాడేందుకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం

Advertisement

తాజా వార్తలు

Advertisement